MBNR: వయోవృద్ధుల అవసరాలను ప్రజలు అర్ధ చేసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వయవృద్ధులను గౌరవిస్తూ వారికి సముచిత స్థానం కల్పించాలని సూచించారు.