WNP: జిల్లా నాగవరం శివారులో కొత్తగా కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాజపేట గ్రామంలోని ప్రభుత్వ యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో తాత్కాలికంగా విద్యాబోధన ప్రారంభం కానుంది. దీంతో మధ్య తరగతి విద్యార్థులకు నాణ్య మైన విద్య అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే మెగా రెడ్డి పేర్కొన్నారు.