GDWL: ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల జిల్లాలోని నిర్వహించిన క్రైమ్ రివ్యూలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పీఎస్ పరిధిలో ‘విలేజ్ హిస్టరీ షీట్స్’ అప్డేట్ చేయాలని, రాత్రి పూట గస్తీ (నైట్ బీట్) చట్టంపై అవగాహన రావాలని కోరారు.