SRD: అధిక శబ్దం చేస్తున్న106 సైలెన్సర్లను సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా తనిఖీల్లో పట్టుబడ్డ సైలెన్సర్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. బైక్లకు అధిక శబ్దం చేసి సైలెన్సర్లను పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.