SRPT: మఠంపల్లి మండలంలోని మంచ్య తండా నూతన సర్పంచ్గా ఎన్నికైన మలోత్ భద్రమ్మ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం ముగిసిన ఈ శిక్షణలో భాగంగా డీఎల్పీవో చేతుల మీదుగా ఆమె శిక్షణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా భద్రమ్మ మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో గ్రామ పంచాయతీ పాలనను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.