BDK: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల(DEC) 31 నుంచి జనవరి 10 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు-2024-25 ఉన్న నేపథ్యంలో నిత్య కళ్యాణాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. తిరిగి జనవరి 11 నుంచి భద్రాద్రిలో నిత్య కళ్యాణాలు పునః ప్రారంభం అవుతాయని అన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.