JGL: రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రథాన్ని ఆలయం చుట్టూ ఐదు సార్లు తిప్పారు. సర్పంచ్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.