GNTR: 2019-2024 మధ్య 60 లక్షల మెట్రిక్ టన్నుల నెయ్యిలో కల్తీ జరిగిందని, ఇందులో రూ. 240 కోట్ల కుంభకోణం ఉందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ఎన్డీడీబీ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టే, నెయ్యిలో వెజిటబుల్, అనిమల్ ఫ్యాట్ కలిపినట్లు సిట్ నివేదిక కూడా స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ ఆరోపణలు చేశారు.