WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో మంగళవారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,260 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.21,700 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.36వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.18,900, ఎల్లో మిర్చికి రూ.21,500 ధర వచ్చింది. మంచి ధర వస్తుండటంతో మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.