NRPT: మక్తల్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం కురిసిన వర్షం రైతులను నిండా ముంచింది. మండలంలోని సంగంబండకి చెందిన ప్రభాకర్ రెడ్డి 18ఎకరాల్లో వరి పంట వేశాడు. నిన్న కురిసిన వర్షానికి పంట మొత్తం నేలరాలింది. రూ.5లక్షల పెట్టుబడితో ఆరుగాలం శ్రమించి వేసుకున్న పంట చేతికొచ్చే దశలో నేలరాలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.