NRML: భైంసా పట్టణంలోని గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా వరద నీరు ఇన్ ఫ్లో వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం తెలిపారు. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టుకు 690 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వచ్చినట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 358.70 మీటర్లు ఉందని తెలియజేశారు.