అన్నమయ్య: ములకలచెరువు నకిలీ మద్యం వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు తాజాగా మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ మేరకు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డిని A17గా, ఆయన బావమరిది గిరిధర్రెడ్డిని A18గా చేర్చారు. వీరితో పాటు బాలాజీ, అన్బురాసు, రవి, అష్రఫ్, సుదర్శన్లపై కూడా కేసు నమోదు చేశారు. కాగా, మొత్తం నిందితుల సంఖ్య 21కి చేరింది.