NDL: కొలిమిగుండ్ల ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం దివ్యాంగులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం దివ్యాంగులు జేఏసీ జిల్లా అధ్యక్షుడు దేవరాజు దివ్యాంగులు కలిసి ఎంపీడీవో ప్రసాద్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.