SKLM: గార మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం గ్రామంలోని శ్రీ శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని పాలకమండలి సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.