MBNR: నవాబ్ పేట మండలం లోకిరేవుకు చెందిన సుజాతకు 108 అంబులెన్స్లోనే సుఖ ప్రసవమైంది. గురువారం ఉదయం నవాబ్ పేట ఆసుపత్రి నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ లక్ష్మణ్, పైలెట్ మహమూద్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.