MBNR: చెరువులను సంరక్షించకపోతే భవిష్యత్తులో తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని మహబూబ్నగర్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ హెచ్చరించారు. జిల్లాలోని 31 చెరువులను ఆక్రమించి ఇళ్లు కట్టుకోవడం, వ్యవసాయం చేయడంపై ఆయన ధ్వజమెత్తారు. చెరువుల ఆక్రమణలను అరికట్టాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.