KMR: నాగిరెడ్డి పేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి 782 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో గురువారం ప్రాజెక్టు అలుగు మీదుగా 742 క్యూసెక్కుల వరద దిగువకు పారుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1464.00/1464.00 అడుగులకు చేరుకోగా నీటి సామర్థ్యం 1.820/1.820 టీఎంసీలకు చేరుకుందని అధికారులు తెలిపారు.