SRCL: కోనరావుపేట మండలంలోని ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్ గిఫ్ట్లను అధికారులు, కాంగ్రెస్ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని అన్ని మతాలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని తహసీల్దార్ వరలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎల్లయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా పాల్గొన్నారు.