KMRD: దొమకొండలో సోమవారం MLC ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచేందుకు కార్యకర్తలు శ్రమించాలని సమావేశంలో చర్చించామన్నారు. బీజేపీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.