KMR: సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో నెల రోజులుగా తాగునీటి కొరతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు వినతులు పెట్టినా స్పందన లేకపోవడంతో గ్రామస్థులు ప్రతి ఇంటి నుంచి రూ.500 చొప్పున సొంతంగా చందాలు వసూలు చేసి ఆదివారం కొత్త బోరు వేసుకున్నారు. దీని కోసం సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేశారు.