RR: గ్రామ అభివృద్ధే తన లక్ష్యం అని మొయినాబాద్ మండలం మోతుకుపల్లి గ్రామ సర్పంచ్ సంపూర్ణ రాములు అన్నారు. ఇవాళ గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. ఐదు సంవత్సరాలలో మరెన్నో అభివృద్ధి పనులు చేసి గ్రామ రూపురేకలు మారుస్తానని తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.