WGL: కేసముద్రం అంగన్వాడి సెంటర్లో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు పాల్గొని మాట్లాడుతూ.. మూడేళ్లు పైబడిన చిన్నారులందరినీ అంగన్వాడి కేంద్రానికి పంపించాలని సూచించారు. చిన్నారులను పౌష్టిక ఆహారంతో పాటు, ఆట పాటలతో, క్రమశిక్షణతో కూడిన విద్యా అందించాలని తెలిపారు.