MNCL: వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధన నైపుణ్యాలు పెంపొందిస్తాయని ప్రిన్సిపల్ సంతోశ్ కుమార్ అన్నారు. బెల్లంపల్లిలోని కాసిపేట బాలుర గురుకులంలో పాఠశాల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ‘ఇన్నోవేటర్స్ అరేనా’ అనే నేపథ్యంతో ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులు, నమూనాలు, ప్రయోగాలు అందరిని ఆకట్టుకున్నాయి.