ADB: సమిష్టి నిర్ణయాలతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి అన్నారు. తాంసి మండల కేంద్రంలోని నాగేశ్వర ఆలయంలో రూ. 5 లక్షల నిధులతో షెడ్డు నిర్మాణానికి గ్రామస్తులతో కలిసి సోమవారం భూమి పూజ చేశారు. ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.