ADB: స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు ‘బెడెన్ పావెల్’ దంపతుల జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 22న ‘థింకింగ్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి, భారత్ స్కౌట్అండ్ గైడ్స్ జిల్లా చీఫ్ కమీషనర్, ఏసీఎల్.బీ ఎస్. రాజేశ్వర్ తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఘనంగా నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోవాలన్నారు.