ADB: ఈనెల 29న పత్తి కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి గజానంద్ మంగళవారం తెలియజేశారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారంతో కొనుగోలు నిలిపివేయడం జరిగిందని వెల్లడించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు రద్దు చేసుకొని మరొక తేదీని ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు.