కరీంనగర్ రూరల్ పోలీసులు మంగళవారం దుర్షేడ్ గ్రామ సమీపంలోని గోపాల్పూర్ చౌరస్తా వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.