ADB: రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ జిల్లాధ్యక్షుడు, కౌన్సిలర్ సాయిచరణ్ గౌడ్ హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా తాజా రాజకీయ అంశాలు, అభివృద్ధి, పలు అంశాలను నరేందర్ రెడ్డితో చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆయన సూచించారు.