ADB: ప్రభుత్వం అందజేసే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్య అధికారి డా. నిఖిల్ రాజ్ తెలిపారు. భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను అందజేశారు. వైద్య విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్, సిబ్బంది తదితరులున్నారు.