MBNR: జిల్లాలో రోడ్ విస్తరణ, వాల్వ్ రిపేర్ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గం. వరకు 24 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ అధికారి డి. శ్రీనివాస్ తెలిపారు. ఈ అంతరాయం మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లోని 258 గ్రామాలకు,నారాయణపేట,మక్తల్,దేవరకద్ర మున్సిపాలిటీలకు పూర్తిగా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.