ADB: గ్రంథాలయం విజ్ఞాన భాండాగారం అని అదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. మంగళవారం తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఖోడద్ అభివృద్ధికి ఉద్యోగుల కృషి అభినందనీయమని అన్నారు. గ్రామంలో విజ్ఞానాన్ని పంచేందుకు లైబ్రరీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.