MNCL: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శకంగా చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు లేకుండా యాప్లో సిబ్బంది వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.