PDPL: రామగుండం ‘మగువ’ లయన్స్ క్లబ్ 2026-27 సంవత్సరానికి గాను గోదావరిఖనికి చెందిన అర్చన రావు (ఇరిగేషన్ విభాగంలో ఇంజినీర్)అధ్యక్షురాలుగా ఎన్నికైంది. గోదావరిఖనిలో గురువారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో మహిళ సాధికారత, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, మహిళా అభ్యున్నతికి కృషి చేస్తామని అర్చన తెలిపారు.