MBNR: మిడ్జిల్ మండలం కేంద్రంలో గత రెండు నెలల నుంచి రోడ్లపై మురుగు పారుతూనే ఉంది. ఈ మురుగు పారుతుండడం వలన దోమల బెడద ఎక్కువై టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయి. అలాగే, కొత్తూరు గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన వాహన దారులు కిందపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.