NGKL: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న టీకాలను ఇప్పించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ రైతులకు సూచించారు. బల్మూరు మండల జినుంట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం గాలికుంటు ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ అమలు చేసిన పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.