MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు టీపీసీసీ కో-ఆర్డినేటర్ ధారాభాస్కర్ తెలిపారు. రెండు రోజుల క్రితం నవాబుపేట పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైందన్నారు. అక్రమాలను అడ్డుకున్నందుకే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సమావేశాన్ని పోలీసులు అనుమతిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.