MNCL: మావోయిస్టుల రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వేమనపల్లి మండలం ఎస్సై శ్యామ్ పటేల్ తనిఖీలు చేపట్టారు. వేమనపల్లి సరిహద్దు ప్రాణహిత పుష్కర ఘాట్ వద్ద అవతలి వైపు మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలు నడిపే వారితో మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులు పడవెక్కితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.