HYD: టోలిచౌకి, హకీంపేట్ డివిజన్లో గల వలసదారులతో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం టోలిచౌకి బస్ స్టాప్ వద్ద ఓ బిహారీ కూలి పై దాడి జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ బీహార్ నుంచి హైదరాబాద్కు వచ్చిన వారితో చర్చించారు. వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.