SDPT: కోహెడ మండలం తగ్గళ్లపల్లిలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల అనంతరం స్వామివారు గ్రామంలోకి తిరిగి విచ్చేసిన సందర్భంగా భక్తులు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా తీసుకువచ్చిన ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.