KMM: ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం క్యాష్లెస్ హెల్త్ కార్డులను ప్రవేశపెట్టిందని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల బారిన పడినప్పుడు ఉద్యోగులకు రూ.1.2 కోట్ల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేశామన్నారు.