WGL: శివనగర్లోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు రికార్డులను స్వయంగా పరిశీలించిన ఆమె, భోజన నాణ్యతను తనిఖీ చేశారు. నిల్వ ఉన్న బియ్యం, కూరగాయలను పరిశీలించి.. మెనూ ప్రకారం సమయానికి భోజనం, స్నాక్స్ అందుతున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.