కామారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ’ శిక్షణ కార్యశాల నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని 12 జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్య క్షుడు రామచంద్రరావు హాజరై పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.