MHBD: జిల్లావ్యాప్తంగా ఉన్న గౌడ కులానికి చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయసన్మాన కార్యక్రమాన్ని ఈనెల 14న నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని సినీ హీరో సుమన్ను ఆహ్వానించారు. మంగళవారం HYDలో ఆయనని కలిసి ఆహ్వానపత్రిక ఇచ్చారు.