KNR: సైదాపూర్ మండలంలోని ఏక్లాస్పూర్ గ్రామంలో ముస్లింలకు గ్రామ సర్పంచ్ బాసరాజు రజిత గురువారం దుస్తులు, కానుకలతోపాటు ఈద్ కా తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.