RR: 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి స్పెషలిస్ట్ వైద్యులతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో డా.లలితా దేవీ తెలిపారు. జిల్లాలో మొదటి దశ కార్యక్రమాలు మాతృ ఆరోగ్యం, మహిళా ఆరోగ్యం, శిశు ఆరోగ్యం, వృద్ధుల గురించి చేపడతామన్నారు. మార్చి 31 వరకు కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.