NLG: కనగల్ మండల ఎంపీడీవోగా వేద రక్షిత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ ఉన్న ఎంపీడీవో జయరాం బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎంపీవో సుమలతను ఇంఛార్జ్ ఎంపీడీవోగా నియమించారు. నూతనంగా నియమితులైన వేద రక్షిత ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు.