NTR: ముంచుకొస్తున్న ముంథా తుఫాను నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సూచించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.