W.G: ముంచుకు వస్తున్న తుఫానుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ‘మొంథా’ తుపాను నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామ పునరావాస కేంద్రంను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ సోమవారం పర్యవేక్షించారు. నీరు, భోజన వసతులను సిద్ధం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.