ASR: మొంథా తుఫాను నేపథ్యంలో ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు జలాశయం అధికారులు అప్రమత్తమయ్యారు. జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా, ప్రస్తుతం 2,747.95 అడుగులకు చేరింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మంగళవారం నుంచి జలాశయం మూడు గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటినిడుమకు విడుదల చేస్తున్నారు.