KRNL: మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ సిరి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల కోసం సిబ్బంది, సామగ్రి సిద్ధంగా ఉంచాలని, ప్రమాదకర వంతెనల వద్ద సిబ్బందిని నియమించి వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.